విద్యనే రాష్ట్రానికి పెట్టుబడిగా భావిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.విద్యార్థుల ఫలితాలను మెరుగు పరచడం కోసం అనేక చర్యలు చేపట్టామని తెలిపారు.
రాష్ట్రంలోని విద్యా రంగంపై అధ్యయనానికి ఇతర రాష్ట్రాల వారు వస్తున్నారని మంత్రి బొత్స పేర్కొన్నారు.ప్రపంచ స్థాయి పోటీని ఎదుర్కొనేలా విద్యార్థులను తయారు చేస్తున్నామని చెప్పారు.
బైలింగువల్ టెక్ట్స్ బుక్స్ తో రెండు భాషల్లో తెలుగు, ఇంగ్లీష లో ఒకేసారి బోధన జరుగుతుందని తెలిపారు.