నయనతార.( Nayanthara ) సంచలనాలకు కేరాఫ్ అడ్రస్.
ప్రేమ, పెళ్లి, మతం, సినిమాలు, జీవితం ఇలా అన్ని విషయాల్లో ఆమె ఏం చేసిన సంచలనమే.అలా అని ఆమె పొరపాట్లు చేస్తుందని కాదు కానీ నయన్ కి మీడియా అటెన్షన్ చాల ఎక్కువ.
మీడియా తో చాల తక్కువగా క్లోజ్ గా ఉండటం తో ఆమెకు సంబందించిన విషయాలను జనాలకు చేరవేయడం కోసం గాసిస్ రాయుళ్లు ఆమెపై మరింత ఫోకస్ చేస్తూ ఉంటారు.అందుకే నిజమో అబద్దమో తెలియని ఎన్నో విషయాలు ఎప్పుడు సోషల్ మీడియాలో నానుతూ ఉంటాయి.
ఇలా ఏళ్లకు ఏళ్ళు ఆమెపై వార్తలు, వీడియోస్, గాసిప్స్ రాస్తూ ఉన్నప్పటికి ఇప్పటి వరకు ఆమె ఏ విషయాన్ని అంగీకరించలేదు అలాగని ఖండించను లేదు.

ఏది ఏమైనా ఆమె లేడీ సూపర్ స్టార్.ఖచ్చితంగా ఇది అందరు ఒప్పుకోవాల్సిన విషయం.నయన్ ని ప్రేమ పేరుతో మోసం చేసిన ఆమె బాధను ఎప్పుడు ఎక్కడ పంచుకుంది లేదు.
చివరికి పెళ్లి చేసుకొని సరోగసి ( Surrogacy ) ద్వారా ఇద్దరు అబ్బాయిలను కన్నా కూడా ఆమెపై ఎన్నో వార్తలు పుట్టకచ్చిన చలించింది లేదు.ఒక్కోసారి ఈ వార్తలు ఎక్కడి వరకు వెళ్తాయి అంటే పెళ్ళైన కొన్ని రోజులకే ఇలా సరోగసి ద్వారా బిడ్డలను కన్నట్టు నయన్ విగ్నేష్ దంపతులు( Nayan Vignesh ) ప్రకటిచగానే సోషల్ మీడియా తమ చేతులకు పని చెప్పాయి.
దాంతో సోషల్ మీడియా హడావిడి గమించిన అధికారులు ఆ పిల్లల పుట్టుక మరియు లీగల్ అంశాల గురించి వివరణ ఇవ్వాలని ఏకంగా ఆమె ఇంటికి నోటీసులు కూడా పంపించారు.

అయితే ఆమె ఎవరిని తన ఇబ్బందులకు కారణం చేయలేదు.మౌనంగానే అన్ని ఎదుర్కొంటు వచ్చింది.చివరికి ఒక ఇంటర్వ్యూ లో తన పిల్లల గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యింది.
ఆమె మొహానికి మేకప్ వేసుకునే హీరోయిన్ అయినా కూడా ఎంతో ఎమోషనల్ పర్సన్ అని ఆ ఇంటర్వ్యూ చుసిన వారు ఎవరైనా చెప్తారు.తనకు ఇద్దరు పిల్లలు అక్టోబర్ లో పుట్టారని, కానీ నా గర్భం నుంచి వారిని కనలేదు కానీ ప్రస్తుతాని అమ్మతనాని ఎంతగానో ఆస్వాదిస్తున్నాని తెలిపింది.
తన ప్రతిరోజు వారితోనే మొదలై వారితోనే ముగుస్తుంది అని ఒక సగటు మహిళగా మాట్లాడింది నయన్.







