రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పెట్ మండలo హై స్కూల్ వెనుక ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి ఈ సంఘటనలో ఎల్లారెడ్డిపేటకు చెందిన బందారపు భానుచందర్ రెడ్డి అనే రైతు కు చెందిన కూరగాయలు పొలము బోరు మోటర్, గుడిసె పైపులు దగ్ధమై సు మారు 60000 వరకు ఆస్తి నష్టం జరిగినట్లు రైతు తెలిపారు.ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇట్టి విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు.శనిగరపు రాములు అనే రైతు కు చెందిన సుమారు 10,000 రూపాయల పైపులు కాలిపోయినట్లు రైతు తెలిపారు.
జరిగిన సంఘటన పై మండల తాసిల్దార్ జయంత్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంతోష్ కు జరిగిన నష్టముపై మాజీ ఎంపిటిసి ఒగ్గు బాలరాజు యాదవ్ సమాచారం అందించారు.గ్రామంలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరమని సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి, ఉప సర్పంచ్ ఓగ్గు రజిత యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.గతంలో కూడా శనిగరపు రాములు అనే రైతుకు చెందిన పవర్ ట్రిలర్,పైపులు,స్ప్రే పంపు కూడా ప్రమాదవశాత్తు ఇదే రకంగా జరిగిన అగ్ని ప్రమాదంలో దగ్డమై లక్ష యాభై రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందనీ బాధితులను ఆదుకోవాలని సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి, ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు.