పోలవరం ప్రాజెక్టును కేంద్ర జలసంఘం నిపుణుల కమిటీ సందర్శించనుంది.ఇప్పటికే పోలవరానికి చేరుకున్న కమిటీ సభ్యులు ఇటీవల ధ్వంసమైన గైడ్ బండ్, ఎగువ కాఫర్ డ్యామ్ ను పరిశీలించనున్నారు.
తరువాత గైడ్ బండ్ నిర్మాణంలో చోటు చేసుకున్న లోపాలపై అధ్యయనం చేయనున్నారు.రేపు అధికారులతో నిపుణుల కమిటీ సమావేశం కానున్నారు.
ఇందులో భాగంగా ప్రాజెక్టు సమస్యలపై చర్చించిన అనంతరం రెండు సమస్యలకు మార్గాలను సూచించనున్నారు.తరువాత కేంద్ర జలసంఘానికి నివేదికను సమర్పించనున్నారు.