నంద్యాల జిల్లాలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తుంది.శ్రీశైలం సాక్షి గణపతి ఆలయం సమీపంలో పులి సంచరిస్తుంది.
ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో సాక్షి గణపతి ఆలయం సమీపంలో పులి రోడ్డు దాటుతుండగా అటవీ శాఖ సిబ్బంది గమనించారు.దీంతో అప్రమత్తమైన అధికారులు పులి సంచరించిన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.
మరోవైపు పెద్దపులి సంచారం నేపథ్యంలో స్థానికులతో పాటు భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.







