ప్రముఖ టాలీవుడ్ నటి జయలలిత ( Jayalalithaa )ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.గతాన్ని గుర్తు చేసుకుంటానని కొన్నిసార్లు బాధ పడతానని కొన్నిసార్లు ఇంతేనేమో అని సర్ది చెప్పుకుంటానని అమె పేర్కొన్నారు.
ఒక మంచి జంటను చూసిన మన జీవితం ఇలా లేదే వచ్చే జన్మలో అయినా ఈ విధంగా కుదిరితే బాగుంటుందేమో అని అనిపిస్తుందని జయలలిత చెప్పుకొచ్చారు.
నాకు నాగేంద్ర( Nagendra ) అనే ఫ్రెండ్ ఉన్నాడని ఆ స్నేహితుడు నేను కష్టంలో ఉంటే ఎన్నోసార్లు సాయం చేశారని జయలలిత అన్నారు.
నా గురించి నెగిటివ్ గా పేరు తెచ్చుకోలేదని ఆమె పేర్కొన్నారు.నాకు డబ్బు కంటే ఆరోగ్యం ముఖ్యమని ఆమె తెలిపారు.సాయిబాబా నామస్మరణ( Sai Baba ) ఎక్కువగా చేస్తానని జయలలిత తెలిపారు.నా ఇమేజ్ మార్చాలని ఎందుకు ప్రయత్నించలేదని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం.

నా డ్యాన్స్ లైఫ్ పోయిందని బాధ వేసిందని ఆమె అన్నారు.శంకరా భరణంలో మంజు భార్గవికి( Manju Bhargavi ) వచ్చిన తరహా పాత్ర నాకు వచ్చి ఉంటే బాగుండేదని జయలలిత అన్నారు.నేను బోరింగ్ పాపగానే ప్రేక్షకులకు సుపరిచితమని ఆమె కామెంట్లు చేశారు.నా పేరు లలిత అని జయలలిత అనే పేరు నాకు మైనస్ అయిందని ఆమె పేర్కొన్నారు.
పేరు మార్చుకోవాలని చాలామంది బెదిరించినా నేను మార్చుకోవాలని జయలలిత అన్నారు.

భవిష్యత్తు ఎలా ఉండాలంటే బోలెడు ఆశ్రమాలు, బోలెడు గుళ్లు ఉన్నాయని వాటిని శుభ్రం చేసుకుని ప్రసాదాలు పెడితే వాటిని తింటూ బ్రతుకుతానని ఆమె తెలిపారు.డ్యాన్స్ కే జీవితం డెడికేట్ చేయాలని అనుకున్నానని జయలలిత పేర్కొన్నారు.జయలలిత వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాబోయే రోజుల్లో ఆమె కెరీర్ పరంగా బిజీ కావాలని అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.







