మా వృద్ధాశ్రమంలో బియ్యం పంపిణీ చేసిన గంభీరావుపేట ఎస్సై మహేష్.

రాజన్న సిరిసిల్ల జిల్లా : తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గంభీరావుపేట ( Gambhiraopet ) మా వృద్ధాశ్రమంలో అభాగ్యులకు అండగా ఎస్సై మహేష్ ( SI Mahesh )ఆధ్వర్యంలో బియ్యం, బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేసినట్లు తెలిపారు.రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ప్రతి మండలంలో పోలీసులు అభాగ్యులను అక్కున చేర్చుకుని తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు.

 Gambhiraopet Ssi Mahesh Who Distributed Rice In Our Old Age Home.-TeluguStop.com

ఈరోజు గంభీరావుపేట మా వృద్ధాశ్రమంలో( Old age home ) అనాధ వృద్ధులకు తమ సిబ్బంది తో కలసి ఎస్ఐ మహేష్ ఆధ్వర్యంలో బియ్యం, బిస్కెట్ ప్యాకెట్స్ ను పంపిణీ చేశారు.వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులను పిల్లలు వృద్ధాప్యంలో ఒంటరిగా వదిలివేయకుండా వారికి తోడుగా ఉండాలన్నారు.తల్లిదండ్రులను విస్మరించిన వారిపై చట్టం లో పలు సెక్షన్ ల ప్రకారం శిక్షార్హులు అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గంభీరావుపేట పోలీస్ సిబ్బంది, మా వృద్ధాశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube