ఏపీలో వైఎస్ఆర్ యంత్రసేవా పథకం ప్రారంభం

రైతు సంక్షేమమే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం పని చేస్తోంది.ఈ మేరకు రాష్ట్రంలో వైఎస్ఆర్ యంత్రసేవా పథకం రెండో మెగా మేళా ప్రారంభమైంది.

 Ysr Yantraseva Scheme Started In Ap-TeluguStop.com

ఇందులో భాగంగా గుంటూరు జిల్లాలో ట్రాకర్లు, హార్వెస్టర్లను సీఎం జగన్ పంపిణీ చేశారు.13,573 ఇతర వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేయడంతో పాటు రైతన్నల గ్రూప్ ల ఖాతాల్లో రూ.125.48 కోట్ల సబ్సిడీని జగన్ జమ చేశారు.

అనంతరం సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.రైతులకు వైసీపీ ప్రభుత్వం అండగా నిలిచిందన్న ఆయన గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చామన్నారు.ప్రతి ఆర్బీకే సెంటర్ లో యంత్రాలకు రూ.15 లక్షలు కేటాయించామని తెలిపారు.అదేవిధంగా ఆర్బీకే పరిధిలో రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు తక్కువ ధరలకే అందిస్తున్నామన్నారు.ఈ మేరకు రైతులు యంత్రసేవా యాప్ లో వాహనం బుక్ చేసుకోవచ్చని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube