కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ.మురళీధరన్( MoS V Muraleedharan ) బ్రూనైలో పర్యటిస్తున్నారు.
ఈ సందర్భంగా దారుస్సలాంలో భారతీయ కమ్యూనిటీతో( Brunei Indian community ) ఆయన భేటీకానున్నారు.అంతకుముందు తొలిసారిగా బ్రూనై( Brunei ) వచ్చినందుకు ఆనందంగా వుందని.
ఇక్కడి బిజినెస్ లీడర్స్, ఇండియన్ కమ్యూనిటీ ప్రతినిధులతో భేటీ అయ్యేందుకు ఎదురుచూస్తున్నానని మురళీధరన్ ట్వీట్ చేశారు.మే 30 నుంచి జూన్ 2 వరకు కేంద్ర మంత్రి బ్రూనై, మలేషియాల్లో పర్యటించనున్నారు.అధికారిక లెక్కల ప్రకారం.14000 మంది భారతీయులు బ్రూనైలో స్థిరపడ్డారని అంచనా.ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (ఏకేఏఎం) వేడుకల్లో భాగంగా అక్కడి భారతీయ సంఘాలు సాంస్కృతిక ప్రదర్శనలను నిర్వహిస్తాయని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
![Telugu Azadika, Belait, Brunei, Bruneiindian, Jai Shankar-Telugu NRI Telugu Azadika, Belait, Brunei, Bruneiindian, Jai Shankar-Telugu NRI](https://telugustop.com/wp-content/uploads/2023/05/Look-forward-to-engagements-with-Indian-community-in-Brunei-says-MoS-Muraleedharan-detailss.jpg)
బ్రూనై పర్యటన ముగించుకుని జూన్ 1, 2 తేదీల్లో మురళీధరన్ మలేషియాలో పర్యటిస్తారు.ఈ సందర్భంగా మలేషియా విదేశాంగ శాఖ డిప్యూటీ మినిస్టర్ దాతుక్ మొహమ్మద్ బిన్ అలమిన్, ఆ దేశ మానవ వనరుల శాఖ మంత్రి వి.శివకుమార్ తదితరులతో మురళీధరన్ భేటీ అవుతారు.తొలుత భారత సంతతి వ్యక్తుల దినోత్సవం (అప్రవాసి దివాస్)లో ఆయన పాల్గొంటారు.అలాగే జూన్ 2 నుంచి 4 వరకు జరిగే పీఐవో ఇంటర్నేషనల్ ఫెస్టివల్ను మురళీధరన్ ప్రారంభిస్తారు.ప్రవాసీయ భారతీయ ఉత్సవ్లో పాల్గొని ప్రసంగిస్తారు కేంద్ర మంత్రి.2.75 మిలియన్ల మంది భారత మూలాలున్న వ్యక్తులతో మలేషియా పీఐవోలకు సంబంధించి ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశంగా నిలిచింది.
![Telugu Azadika, Belait, Brunei, Bruneiindian, Jai Shankar-Telugu NRI Telugu Azadika, Belait, Brunei, Bruneiindian, Jai Shankar-Telugu NRI](https://telugustop.com/wp-content/uploads/2023/05/Look-forward-to-engagements-with-Indian-community-in-Brunei-says-MoS-Muraleedharan-detailsa.jpg)
కాగా.విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ .శంకర్ రేపటి నుంచి దక్షిణాఫ్రియా, నమీబియాలలో పర్యటించనున్నారు.తొలుత కేప్టౌన్లో జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశాలలో ఆయన పాల్గొంటారు.అలాగే దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి నలేడి పండోర్తోనూ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొని, ఆ దేశ అధ్యక్షుడితో భేటీ అవుతారు.
దీనితో పాటు ఇతర బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రులతో జైశంకర్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు.ఇదే పర్యటనలో కేప్టౌన్లోని ప్రవాస భారతీయులతోనూ ఆయన భేటీకానున్నారు.