తెలుగు ప్రేక్షకులకు నటి బీజేపీ ( BJP )నేత అయిన విజయశాంతి( Vijayashanthi ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయాలలో( Movies and politics ) కూడా సక్సెస్ ఫుల్ గా రాణిస్తోంది విజయశాంతి.
ఇటీవలె ఈమె సెకండ్ ఇన్నింగ్స్ ని కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా విజయశాంతి ట్వీట్ చేస్తూ ఇద్దరు నేతలపై విమర్శలు కురిపించింది.
అందులో ఒకరు మంత్రి హరీష్ రావు( Harish rao ) కాగా మరొకరు మాజీమంత్రి ఈటల రాజేందర్( Etela Rajendra ).విజయశాంతి తన ట్వీట్ లో ఈ విధంగా రాసుకొచ్చింది.బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల చేతులెత్తేశారు, చిట్ చాట్ లో ఈటల చెప్పారు.

చేరికలు ఇక లేవు అంటున్న ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు, బీజేపీని నిరంతరం గెలిపిస్తున్నది ప్రాణమిచ్చే కార్యకర్తల త్యాగాలు, బీజేపీని నమ్మే ప్రజల విశ్వాసాలు, రక్తమిచ్చే హైందవ ధర్మశ్రేణుల పోరాటాలు మాత్రమే చేరికల కమిటీ పేరు చెప్తూ, చిట్ చాట్ లను ప్రస్తావిస్తూ మీరు చేస్తున్న బీజేపీ వ్యతిరేక విమర్శల ప్రచారం ఎన్నటికి నిలవదు.ఇది హరీష్ రావు గారికి తెలవంది కాదు అంటూ ట్వీట్టర్ వేదికగా హరీష్ రావును విమర్శిస్తునే ఈటల వల్ల బీజేపీకి ఎటువంటి ప్రయోజనం లేదనట్లుగా ట్వీట్ చేసింది.

ఇకపోతే విజయశాంతి విషయానికి వస్తే ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్న విజయశాంతి, ప్రస్తుతం రాజకీయాలలో ఫుల్ యాక్టివ్ గా పాల్గొంటుంది.ఇటీవలె సెకండ్ ఇన్నింగ్స్ ని కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే.మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది విజయశాంతి.
ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది విజయశాంతి.చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది.







