టీడీపీ ఎవరితో పొత్తు పెట్టుకున్నా తమకు నష్టం లేదని మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.కేజీ బంగారం ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టినా టీడీపీని ప్రజలు నమ్మరని చెప్పారు.
పేదల కోసం జగన్ ఎన్నో సంక్షేమ పథకాల అమలు చేస్తున్నారని మంత్రి ఆదిమూలపు వెల్లడించారు.ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీనే విజయం సాధిస్తుందన్న ఆయన మళ్లీ జగనే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.







