టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.చంద్రబాబు కాపీ క్యాట్ గా మారారన్న ఆయన చంద్రబాబును ఏపీ ప్రజలు నమ్మరని తెలిపారు.
2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని మంత్రి కాకాణి ఆరోపించారు.అబద్దాలు చెప్పడం చంద్రబాబుకు అలవాటేనని పేర్కొన్నారు.
రుణమాఫీ పేరుతో మహిళలు, రైతులను మోసగించారని తెలిపారు.కర్ణాటకలో కాంగ్రెస్ మేనిఫెస్టోను చంద్రబాబు కాపీ కొట్టారని విమర్శించారు.
కానీ వైసీపీ అధికారంలో జగన్ ఆదర్శవంతమైన పథకాలు తీసుకొచ్చారన్నారు.మేనిఫెస్టోలో 95 శాతం హామీలను నెరవేర్చామన్న ఆయన దళారులు లేకుండా లబ్ధిదారులకు పథకాలు అందించామని వెల్లడించారు.
అంతేకాకుండా నామినేటేడ్ పదవుల్లోనూ అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత ఇచ్చామని స్పష్టం చేశారు.