ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు రాష్ట్ర హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.మద్యం కుంభకోణం కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం తిరస్కరించింది.
దీంతో మనీశ్ సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించే ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తోంది.కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సిసోడియాను సీబీఐ, ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.







