సాధారణంగా సింహాలు చాలా కౄర జంతువులు.ఇవి మనుషులను కూడా లాకెళ్లి చంపేస్తాయి.
కాగా తాజాగా ఒక పెద్ద మగ సింహం( Lion ) ప్రశాంతంగా సఫారీ టూరిస్టులు బస చేసిన క్యాంప్సైట్లోకి ప్రవేశించింది.ఈ భయంకరమైన క్షణం కెమెరాలో రికార్డయింది.
ఈ ఘటన బోత్స్వానాలోని కెగలగాడి సహజ రిజర్వ్లో జరిగింది.ఈ సమయంలో సింహం బల్లలు, కుర్చీల చుట్టూ తిరుగుతూ కనిపించింది.
ఇది కొంతమంది పర్యాటకులకు( Tourists ) దగ్గరగా కూడా వెళ్ళింది, కానీ దాడి చేయలేదు.సింహం శిబిరం ( Campsite )గుండా వెళుతుండగా పర్యాటకులు ప్రశాంతంగా ఉన్నారు.
నిశ్శబ్దంగా ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు.
ఈ వీడియో మే 8న వీడియోలో రికార్డు అయింది.సింహం ఎదురైతే భయపడవద్దని లేదా పరిగెత్తవద్దని తాము ముందే అనుకున్నామని సాక్షులలో ఒకరు చెప్పారు.ఆకస్మిక కదలికలు దాడిని ప్రేరేపించగలవని వారికి తెలుసు కాబట్టి ఆ సింహం వచ్చినా వారు భయపడకుండా కదలికలు చేయకుండా అలానే స్థిరంగా ఉన్నారు.
దయచేసి సింహం చాలా దగ్గరగా తమ ముందు నుంచి వెళ్లడం చాలా థ్రిల్లింగ్ అనిపించిందని ఒక సాక్షి పేర్కొన్నారు.సింహాలు కొన్నిసార్లు నిశ్శబ్దంగా, హెచ్చరిక లేకుండా శిబిరాల్లోకి ప్రవేశిస్తాయి.
అయితే సింహాలు ఒక్కోసారి పెంచి పోషించిన యజమానులను కూడా వదిలిపెట్టవు.ఇప్పటికే ఎన్నో సింహాలు తమ యజమానులపై దాడి చేసి వారి ప్రాణాలను తీసేసాయి.ఇవి ఎప్పుడు ఎలా ఉంటాయో, ఎప్పుడు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తాయో ఎవరూ ఊహించలేరు.కాబట్టి వీటికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం.