నందమూరి బాలయ్య( Balakrishna ) సినిమాలో చేయాలి అంటే ఏ నటి నటులైన ముందుకు వస్తుంటారు.ఎందుకంటే ఆయన మీద ఉన్న అభిమానం అటువంటిది.
కానీ బాలయ్య సినిమాలో అవకాశం వస్తే హీరోయిన్ లయ( Heroine Laya ) ఏడ్చిందట.అదేంటి బాలయ్య సినిమాలో వస్తే లయ ఏడవటం ఏంటి.
అసలు ఏం జరిగింది అని అనుకుంటున్నారా.అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది లయ.అప్పట్లో తన నటనని చూసి ఫిదా అయినా ప్రేక్షకులు చాలామంది ఉన్నారు.ఈమె ఎక్కువగా ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో వచ్చిన సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులతో మంచి పరిచయం పెంచుకుంది.అలా చాలావరకు స్టార్ హీరోలతో జతకట్టి స్టార్ హీరోయిన్లలో తాను ఒక్కరిగా నిలిచింది.
ఇక లయకు సంగీతం, డాన్స్ పట్ల మంచి అవగాహన ఉంది.ఇక హీరోయిన్ గా ఉన్న సమయంలోనే డాక్టర్ శ్రీ గణేష్ గోర్టీని వివాహం చేసుకుంది.ఇక వీరికి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు.ప్రస్తుతం లయ తన ఫ్యామిలీతో లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియాలో స్థిరపడింది.ఇక పెళ్లి తర్వాత లయ సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఫ్యామిలీని చూసుకుంటుంది.
అయితే ఈమధ్య సోషల్ మీడియా అందరికీ అందుబాటులో ఉండటంతో లయ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారింది.
సినిమాలకు దూరంగా ఉంటున్న కూడా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు బాగా టచ్ లో ఉంటుంది.లయ ఎక్కువగా డాన్స్ వీడియోలను బాగా షేర్ చేస్తూ ఉంటుంది.
ఇప్పటికీ ఆమె ఎనర్జీ అస్సలు తగ్గలేదు అని చెప్పాలి.ఒకప్పటి కంటే ఇప్పుడు మరింత అందంగా కనిపిస్తుంది లయ.శరీరంలో ఎటువంటి మార్పులు లేకుండా అంతే అందంతో ఉంది అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.ఇక అటువంటి అందంతో మంచి మంచి డ్రెస్సులను ధరించి తన ఫ్రెండ్స్ తో కలిసి బాగా డాన్స్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది.
అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా లయ కు సంబంధించిన ఒక వార్త బాగా నెట్టింట వైరల్ అవుతుంది.అదేంటంటే తనకు బాలయ్య సినిమాలో చెల్లి పాత్రలో అవకాశం వస్తే నేరుగా ఏడ్చేసిందట.
బాలయ్య నటించిన చెన్నకేశవరెడ్డి సినిమాలో( Chennakeshava Reddy Movie ) బాలయ్య చెల్లి పాత్రలో లయను నటించమని డైరెక్టర్ వివి వినాయక్ కోరాడట.
దాంతో వెంటనే లయ ఏడ్చేసిందట.ఏంటండీ.తెలుగు అమ్మాయిలను చెల్లెలు పాత్రలకే ఎందుకు అడుగుతారు.
హీరోయిన్ గా పనికిరారా అని అన్నారట.దాంతో వినాయక్ నేను అనుకున్న పాత్రకు మీరు కరెక్ట్ సెట్ అవుతారు అని అనిపించి అడిగాను అని అన్నాడట.
ఇక లయ తెలుగు అమ్మాయిలకు హీరోయిన్గా ఎందుకు ఛాన్స్ ఇవ్వరు అని కన్నీరు పెట్టుకొని ప్రశ్నించిందట.దాంతో తన దగ్గర సమాధానం లేదని చెప్పి సారీ చెప్పాడట వినాయక్.
ఈ విషయాన్ని గతంలో వినాయక్ ఓ ఇంటర్వ్యూ ద్వారా బయట పెట్టాడు.