ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు.కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయడానికే సీబీఐ తిరుగుతోందని చెప్పారు.
ఈ క్రమంలో కర్నూలు పరిణామాలపై సీబీఐనే అడగాలని తెలిపారు.
మరోవైపు రాష్ట్రంలో పొత్తులపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని సోము వీర్రాజు చెప్పారు.
రాజధాని అమరావతిలోనే ఉండాలనేది తమ విధానమన్నారు.వైసీపీ ప్రభుత్వం బీసీలను నట్టేట ముంచిందని ఆరోపించారు.
ఈ క్రమంలో రాష్ట్ర నిధులు ఒక్కపైసా ఖర్చు చేసారా అని ప్రశ్నించారు.