ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు.రూ.2 వేల నోట్లు మార్చుకోవడానికి తొందర పడొద్దని సూచించారు.
రూ.2 వేల నోట్లు మార్పిడి కోసం నాలుగు నెలల సమయం ఉందని శక్తికాంతదాస్ తెలిపారు.నోట్ల మార్పిడి నేపథ్యంలో బ్యాంకుల వద్ద రద్దీ తగ్గించడానికి సెప్టెంబర్ వరకు గడువు ఇచ్చామని పేర్కొన్నారు.
లావాదేవీలపై యథావిధిగా నిఘా ఉంటుందని ఆయన వెల్లడించారు.







