సినిమా ఇండస్ట్రీ లోకి రావాలంటేనే ఆడవాళ్ళు భయపడతారు.ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మెల్ డామినేషన్ ఎక్కువ గా ఉంటుంది అందుకే ఇక్కడ కి రావడానికి ఆడవాళ్ళు భయపడతారు….
కానీ ఇప్పుడు రోజులు మారాయి చాలామంది మహిళా దర్శకులు సినీ పరిశ్రమలో రాణిస్తు వస్తున్నారు.ఈ మధ్యకాలంలో సినిమాలు తీస్తూ ఇండస్ట్రీ లో రాణిస్తున్న డైరెక్టర్లు ఎవరో ఒకసారి తెలుసుకుందాం…
లక్ష్మి సౌజన్య(Lakshmi Sowjanya)

లక్ష్మీ సౌజన్య 2021 లో నాగ శౌర్య( Naga Shaurya ) హీరో గా వచ్చిన ‘వరుడు కావలెను’(Varudu Kaavalenu) మూవీని తెరకెక్కించారు.ఈ చిత్రంలో బాక్స్ ఆఫీస్ వద్ద ఒక డీసెంట్ హిట్ గా నిలిచింది…
కంగనా రనౌత్

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్(Kangana Ranaut) తెలుగులో ప్రభాస్ హీరోగా నటించిన ‘ఏక్ నిరంజన్’ (Ek Niranjan) అనే చిత్రంలో హీరోయిన్ నటించింది.ఆమె 2019 లో మొదటిసారి ‘మణికర్ణిక’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు…
మంజుల

సూపర్ స్టార్ కృష్ణ కుమార్తెగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మంజుల(Manjula ) హీరోయిన్ కావాలని ‘సమ్మర్ ఇన్ బెత్లెహమ్’(Summer in Bethlehem) అనే మలయాళ మూవీలో నటించింది.సూపర్ స్టార్ ఫ్యాన్స్ మంజుల హీరోయిన్ గా చేయకూడదని డిమాండ్ చేయడంతో నిర్మాతగా మారి షో అనే చిత్రాన్ని నిర్మించారు.తొలి మూవీతోనే జాతీయ స్థాయిలో బెస్ట్ మూవీగా పేరు తెచ్చుకుంది.2018లో మంజుల దర్శకురాలిగా మారి ‘మనసుకు నచ్చింది’ అనే మూవీని రూపొందించారు.
శ్రీప్రియ

శ్రీప్రియ దర్శకురాలిగా మారి తమిళంలో 2 చిత్రాలకు, కన్నడలో 2 చిత్రాలకు దర్శకత్వం వహించారు.తెలుగులో 2014లో వచ్చిన ‘దృశ్యం’ చిత్రానికి దర్శకత్వం వహించారు…
నందిని రెడ్డి

టాలీవుడ్లోని మహిళా దర్శకులలో నందిని రెడ్(Nandini Reddy)డి ఒకరు.ఆమె 2011లో వచ్చిన ‘అలా మొదలైంది’(Ala Modalaindi) సినిమాతో దర్శకురాలిగా మారారు.ఆ తరువాత జబర్దస్త్, కళ్యాణ వైభోగమే, ఓ బేబీ, తాజాగా అన్ని మంచి శకునములే చిత్రాలను తెరకెక్కించారు…
సుధ కొంగర

కోలీవుడ్ డైరెక్టర్ మణిరత్నం దగ్గర అసిస్టెంట్ పనిచేసిన సుధా కొంగర(Sudha Kongara) 2008లో హాస్యనటుడు కృష్ణ భగవాన్(Krishna Bhagavaan) హీరోగా నటించిన ‘ఆంధ్రా అందగాడు’ సినిమాతో దర్శకురాలిగా మారారు.ఆ తర్వాత సూర్య హీరోగా ‘ఆకాశం నీ హద్దురా’ మూవీని తెరకెక్కించారు.ఈ మూవీకి జాతీయ స్థాయిలో చాలా అవార్డులు వచ్చాయి…
.








