ఉత్తర గోవాలోని అమ్థానే డ్యామ్( Amthane Dam ) వద్ద దారుణం చోటు చేసుకుంది.ఒక మొసలి దాడిలో 45 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది.
ఈ సంఘటన శనివారం జరిగింది.ఈ ఘటనను చూసి చాలామంది షాక్ అయ్యారు.
ఆపై మధ్యాహ్నం 2:20 గంటలకు స్థానిక అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు బాధితురాలి మృతదేహాన్ని సంగీతా బేబుల్ శింగడిగా( Babel ) గుర్తించారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.సంగీత తన మేకలను మేపేందుకు ఆనకట్ట వద్దకు వెళ్లినట్లు సమాచారం.తర్వాత ఆమెకు ఎలాంటి ఆలోచన వచ్చిందో ఏమో కానీ అనవసరంగా నీటిలోకి ప్రవేశించింది.ఆ నీళ్లలోనే ఉన్న ఒక మొసలి మహిళను( Crocodile woman ) గమనించింది.
ఆపై దాడి చేసి ఆమెను నీటి అడుగున లాగింది.అనంతరం ఆమెను విచక్షణారహితంగా కోరికేసింది.
దాంతో తీవ్ర గాయాలైన మహిళ జల సమాధి అయింది.

అగ్నిమాపక కేంద్రం( Fire station ) అధికారులు మృతదేహాన్ని పోలీసులకు అప్పగించారు, తరువాత వారు మరణానికి కచ్చితమైన కారణాన్ని నిర్ధారించడానికి పోస్ట్మార్టం పరీక్షకు పంపారు.ఈ డ్యామ్ అనేక మొసళ్లకు నిలయమని ఆ ప్రాంత స్థానికులు పేర్కొన్నారు.ఈ ఘటనను దృష్టిలో ఉంచుకుని, ప్రజలు నీటిలోకి వెళ్లకుండా ఉండాలని కోరుతున్నారు.
ఈ ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోకుండా నిరోధించడానికి డ్యామ్కు రక్షణగా రెయిలింగ్ను ఏర్పాటు చేయాలని వారు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

ఈ సంగతి తెలిసిన మరికొందరు క్రూరమైన మొసళ్లు ఉన్న ప్రాంతాన్ని క్లోజ్ చేయకుండా ఓపెన్ గా ఎలా వదిలేసారు అంటూ అధికారులపై ఫైర్ అవుతున్నారు.ఇకపై ఎవరి ప్రాణాలు పోకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.







