రైతులు ఆయిల్ పాం సాగుపై దృష్టి సారించాలి... .ఎంపీపీ పడిగల మానస రాజు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి రైతు వేదిక లో బద్దెనపల్లి క్లస్టర్ పరిధిలో గల ఆరు గ్రామాల రైతులకు ప్రత్యామ్నాయ పంటల గూర్చి ముఖ్యంగా ఆయిల్ ఫామ్ సాగుపై ( Oil palm cultivation )ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీపీ పడగల మానస రాజు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) వాణిజ్య పంటలైన ఆయిల్ ఫామ్ పై ప్రత్యేక దృష్టితో ఆయిల్ ఫామ్ సాగు చేసిన రైతులకు సబ్సిడీ అందిస్తూ ప్రోత్సహిస్తున్నారని కాబట్టి ఈ క్లస్టర్ పరిధిలో గల రైతులందరూ ఆయిల్ ఫాం సాగుపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా తెలియజేశారు.

 Farmers Should Focus On Oil Palm Cultivation Mpp Padigala Manasa Raju-TeluguStop.com

ఈ క్లస్టర్ పరిధిలో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులు కొక్కిరాల సత్యనారాయణ రావు,(బదేనపల్లీ) 9 ఏకరాలు, పన్యాల విట్టల్ రెడ్డి (రామన్న పల్లె) 7 ఏకరాలు సాగుచేసిన సందర్భంగా వారిని ఎంపీపీ పడగల మానస రాజు మరియు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘనంగా సన్మానించారు.వీరిని ఆదర్శంగా తీసుకొని ఆయిల్ ఫామ్ పై దృష్టి సారించాలని ఎంపీపీ కోరారు.

ఈ కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రాజిరెడ్డి, ఎంపీటీసీ చిలువేరు ప్రసూన,సర్పంచ్ ఆనందరావు ఏవో సందీప్,అగం రావు, ఏ ఈ ఓ లు, వివిధ గ్రామాల నాయకులు రైతు సోదరులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube