మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీతా రెడ్డి, అల్లుడు రాజశేఖర్ లు మరోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు.విచారణలో భాగంగా ఇద్దరి స్టేట్ మెంట్ ను అధికారులు రికార్డ్ చేస్తున్నారు.
కాగా ఇప్పటికే పలు దఫాలుగా వారిని సీబీఐ అధికారులు విచారించారు.అదేవిధంగా హత్యకు ముందు వివేకానంద రెడ్డి రాసిన లేఖపై సీబీఐ ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది.
మరోవైపు ఇదే కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు.







