వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర తీవ్రస్థాయిలో మండిపడ్డారు.సర్కార్ కు ప్రజా సమస్యలు పట్టడం లేదన్నారు.
చంద్రబాబు, ఆయన ఇల్లు తప్ప ప్రభుత్వానికి ఏమీ కనబడటం లేదని విమర్శించారు.
హైదరాబాద్ లో ఉండే ఇల్లు చంద్రబాబుదని ధూళిపాళ్ల తెలిపారు.
ఉండవల్లిలో ఆయన అద్దెకు ఉంటున్నారని చెప్పారు.బెంగళూరు ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్, హైదరాబాద్ లోటస్ పాండ్ ఏదైనా జగన్ పేరు మీద లేదా భారతి రెడ్డి పేరు మీద ఉన్నాయా అని ప్రశ్నించారు.
అవి ఎవరి పేరు మీద ఉన్నాయో చెప్పగలరా అని నిలదీశారు.క్విడ్ ప్రోకో ద్వారా వచ్చిన ప్యాలెస్ లు కాబట్టే సమాధానం లేదని విమర్శించారు.
సీఐడీ కూడా జగన్ జేబు సంస్థలా పనిచేయడం దుర్మార్గమని తెలిపారు.







