క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ విచారణ నిమిత్తం హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.థాయిలాండ్ గ్యాంబ్లింగ్ కేసులో భాగంగా విచారణకు ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు.
ఇందులో భాగంగా కోట్ల రూపాయల లావాదేవీలపై ఈడీ అధికారులు చీకోటిని ప్రశ్నించనున్నారు.అదేవిధంగా ఆర్థిక లావాదేవీలతో పాటు నగదు బదిలీలపై ఆరా తీయనున్నారు.
కాగా ఇదే కేసులో చీకోటితో పాటు చిట్టి దేవేందర్ రెడ్డి, మాధవ రెడ్డిలకు సైతం ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.