హన్మకొండ టెన్త్ పేపర్ లీకేజీ కేసులో విద్యార్థి హరీశ్ ఫలితాలను అధికారులు హోల్డ్ లో పెట్టారని తెలుస్తోంది.పదో తరగతి లీక్ లో హన్మకొండ స్కూల్ లో హరీశ్ దగ్గర పేపర్ ఫొటో తీసుకున్న నిందితులు వాట్సాప్ లో పెట్టారు.
దీంతో హరీశ్ ను డీబార్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.అయితే కోర్టు ఆదేశాలతో హరీశ్ తిరిగి పరీక్షలు రాశాడు.
కానీ విద్యార్థి హరీశ్ ఫలితాలను ప్రకటించని అధికారులు రిజల్ట్ ను హోల్డ్ లో పెట్టారు.ఈ నేపథ్యంలో ఎన్ఎస్ యూఐ నేతలు మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి.
హరీశ్ ఫలితాలు ప్రకటించాలని కోరారని సమాచారం.