ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యే పొడెం వీరయ్య మధ్య చెలరేగిన వాగ్వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరంలో తునికాకు బోనస్ చెక్కుల పంపిణీ జరిగింది.
ఈ కార్యక్రమంలో సంఘటన చోటు చేసుకుంది.విప్ రేగా కాంతారావు పార్టీ ప్రస్థావన తేవడంతో పొడెం వీరయ్య అడ్డుకున్నారు.
ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీ ప్రసంగం ఎందుకని ప్రశ్నించడంతో ఇరువురి మధ్య ఘర్షణ నెలకొంది.దీంతో కార్యక్రమంలో కాసేపు టెన్షన్ వాతావరణం ఏర్పడింది.







