ఇటీవలే మైనర్ బాలికలపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి.ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న పిల్లలకు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి పాల్పడుతున్నారు.
సోమవారం మధ్యాహ్నం కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ లో ఏడేళ్ల బాలికపై 56 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.దానికి సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
![Telugu Latest Telugu, Raped-Latest News - Telugu Telugu Latest Telugu, Raped-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/05/7-year-old-Raped-by-53-years-old-man.jpg)
వివరాల్లోకెళితే.ఆంధ్రప్రదేశ్లోని ఏలూరుకు చెందిన రమేష్ (56) ఒక సంవత్సరం నుండి కాగజ్ నగర్ లోని సీబాపు కాలనీలో ఉండే బిలీవర్స్ ఈస్ట్రాన్ చర్చి ఫాదర్ తిమోతి వద్దా డ్రైవర్ గా పని చేస్తున్నాడు.రమేష్ భార్య పిల్లలు ఏలూరులో ఉండడంతో, రమేష్ చర్చి ఫాదర్ ఇంట్లోనే నివాసం ఉంటున్నాడు.
సీబాపు కాలనీలో ఉండే నిరుపేద దంపతులు ప్రతిరోజు కూలీ పనులకు వెళ్తూ తమ ఏడేళ్ల కూతురిని, నాలుగేళ్ల కుమారుడిని ప్రతిరోజు చర్చి ఫాదర్ తిమోతి ఇంటి వద్ద వదిలి వెళ్లేవారు.
సాయంత్రం కూలీ పనులు ముగించుకొని ఇంటికి వెళ్లేటప్పుడు తమ పిల్లలను ఇంటికి తీసుకు వెళ్లేవారు.సోమవారం కూడా తమ పిల్లలను చర్చి ఫాదర్ తిమోతి ఇంటి వద్ద వదిలేసి వెళ్లారు.
అయితే చర్చి ఫాదర్ కుటుంబ సభ్యులు ఇంట్లో తమ పనులలో ఉండగా, నాలుగేళ్ల బాలుడిని రమేష్ బెదిరించి బయటకు పంపించాడు.ఒంటరిగా ఉన్న ఏడేళ్ల బాలికను ఇంటి సమీపంలో ఉండే మరుగుదొడ్డిలోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
![Telugu Latest Telugu, Raped-Latest News - Telugu Telugu Latest Telugu, Raped-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/05/minor-giral-rape.jpg)
బాలికకు రక్తస్రావం కావడంతో పాటు భరించలేని నొప్పి ఉండడంతో ఏడ్చుకుంటూ బయటకు వచ్చింది.బాలిక ఏడుపు విని చుట్టుపక్కల వారు అంతా వచ్చి రమేష్ ను చితకబాది, బాలికను ఆసుపత్రికి తీసుకువెళ్లారు.పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన గురించి పూర్తిస్థాయిలో విచారించి నిందితుడిని అరెస్టు చేశారు.రమేష్ ను కఠినంగా శిక్షించాలని కాలనీ మహిళలు పోలీసులకు కోరారు.