కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ రేపు హైదరాబాద్ కు రానున్నారు.కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత ఆమె నేరుగా నగరానికి చేరుకోనున్నారు.
ఈ క్రమంలో ప్రియాంక గాంధీకి ఘనంగా స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సన్నహాలు చేస్తున్నారు.అయితే కర్ణాటకలో రేపు సాయంత్రం 5 గంటలతో ప్రచార గడువు ముగియనుంది.
ముందుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రానున్న ప్రియాంక గాంధీ సరూర్ నగర్ లో నిరుద్యోగ జంగ్ సైరన్ సభలో ఆమె పాల్గొననున్నారు.అనంతరం సభలో ప్రియాంక గాంధీ ప్రసంగించనున్నారు.
కాగా యువ సంఘర్షణ సభలో ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటించనున్నారు.అయితే యూత్ డిక్లరేషన్ లో పలు కీలక అంశాలను పొందుపరిచారు.
ఇందులో జాబ్ క్యాలెండర్, ఫీజు రీయింబర్స్ మెంట్ తో పాటు నిరుద్యోగ భృతి వంటి అంశాలను ప్రస్తావించారని సమాచారం.