తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి( Alekhya Reddy ) సోషల్ మీడియాలో మళ్లీ యాక్టివ్ అవుతున్నారు.సోషల్ మీడియాలో అలేఖ్యారెడ్డి ఏ పోస్ట్ పెట్టినా క్షణాల్లో వైరల్ అవుతోంది.
అయితే అలేఖ్యారెడ్డి పోస్ట్ లలో బాధ కనిపిస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.తారకరత్న ( Nandamuri Tarakaratna ) మృతిని ఆమె ఇంకా మరిచిపోలేదని కొంతమంది సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అలేఖ్యారెడ్డి తారకరత్న ప్రేమించి పెళ్లి చేసుకున్న నేపథ్యంలో పెళ్లి తర్వాత ఈ జంటకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి.నందమూరి కుటుంబంలో బాలయ్య( Balakrishna ) మాత్రమే ఈ జంటకు అండగా నిలిచారు.
ఇప్పుడు కూడా అలేఖ్యారెడ్డి కుటుంబానికి తన వంతుఆ ఆర్థికంగా బాలయ్య సపోర్ట్ చేస్తున్నారు.అలేఖ్యారెడ్డి కన్నీటిని తుడిచే వాళ్లెవరూ లేరని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ రీజన్ వల్లే సోషల్ మీడియా వేదికగా ఆమె ఎమోషనల్ పోస్ట్ లు పెడుతున్నారని కొంతమంది వెల్లడిస్తున్నారు.అలేఖ్యారెడ్డి ఈ బాధ నుంచి కోలుకోవడానికి మరి కొంత సమయం పడుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.తారకరత్న చిన్ననాటి ఫోటోలను సైతం ఆమె తరచూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.అలేఖ్యారెడ్డి వర్క్ తో బిజీ అయితే మాత్రమే ఈ పరిస్థితి మారుతుందని కొంతమంది చెబుతున్నారు.
అలేఖ్యారెడ్డి సాధారణ స్థితికి రావాలని సంతోషంగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
అలేఖ్యారెడ్డి తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారని , ఎన్నో ఇబ్బందులు పడ్డారని సమాచారం.అలేఖ్యారెడ్డికి నందమూరి కుటుంబం నుంచి అన్ని విధాలా సపోర్ట్ లభిస్తే బాగుంటుందని అలా జరిగితే మాత్రమే తారకరత్న ఆత్మకు శాంతి చేకూరుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.తారకరత్న 39 సంవత్సరాల వయస్సులోనే గుండె సంబంధిత సమస్యలతో మృతి చెందడంతో అలేఖ్యారెడ్డికి కష్టాలు మొదలయ్యాయి.
సరైన సమయంలో చికిత్స అందించి ఉంటే తారకరత్న బ్రతికేవారని చాలామంది కామెంట్లు చేస్తున్నారు.