తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, బీఆర్ఎస్ ప్రభుత్వం మధ్య మరో పంచాయితీ షురూ అయింది.నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ హాజరు కాకపోవడంపై మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.
ఈర్ష్యతోనే గవర్నర్ రాలేదని ఆరోపించారు.మరోవైపు మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలను రాజ్ భవన్ ఖండించింది.
సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి గవర్నర్ కు ఆహ్వానం ఇవ్వలేదని తెలిపింది.అందువలనే గవర్నర్ హాజరు కాలేదని వెల్లడించింది.
ఆహ్వానించినా రాలేదన్న ఆరోపణల్లో నిజం లేదని రాజ్ భవన్ స్పష్టం చేసింది.