రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందత్వ నిర్మూలన రాష్ట్రంగా మారడానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి కోరారు.మంగళవారం కోనరావుపెట మండలం మర్తనపేట గ్రామంలో రెండవ విడత కంటి వెలుగు పరీక్ష శిబిరాన్ని జడ్పీ చైర్ పర్సన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరహిత సమాజం నిర్మాణం కోసమే ముఖ్యమంత్రి కెసిఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు.ప్రముఖ వైద్యుల పర్యవేక్షణలో,ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలను నిర్వహించి వారికి మందులను కళ్ల అద్దాలను అందజేయడం జరుగుతుందన్నారు.
ప్రజలు ఎవరు కూడా కంటి సమస్యలతో బాధపడవద్దనే ముఖ్య లక్ష్యంతో కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలతో పాటు మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారని, అవసరమైన వారికి కంటి ఆపరేషన్ సైతం చేయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అకాల వర్షాలు విధ్వంసం సృష్టించాయని, నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దన్నారు.పంట నష్టపోయిన రైతుల వివరాలను సేకరించి వారి ఖాతాల్లోనే పదివేల రూపాయల నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, గ్రామ సర్పంచ్ వంశీకృష్ణరావు, సింగిల్ విండో చైర్మన్ రామ్మోహన్ రావు, సర్పంచ్లు మల్లేశ్, లతమహెందర్, డైరెక్టర్ శ్రీనివాస్, బిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు తీగల శ్రీనివాస్, డాక్టర్లు వేణుమాధవ్,భూపాల్, ప్రోగ్రాం ఆఫీసర్ రజిని,వార్డు సభ్యులు,గ్రామ ప్రజలు,వైద్య సిబ్బంది పాల్గొన్నారు.







