ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధం అవుతోంది.ఈ నెలాఖరులో పార్లమెంట్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
ఈ మేరకు ప్రారంభోత్సవ అధికారిక తేదీని కేంద్రం త్వరలోనే ప్రకటించనుంది.కాగా డిసెంబర్, 2020లో పార్లమెంట్ భవనానికి ప్రధాని మోదీ భూమి పూజ చేశారు.
మొత్తం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొత్త పార్లమెంట్ భవనం నిర్మితమవుతోంది.అయితే గత ఏడాది నవంబర్ లో పనులు పూర్తి కావాల్సి ఉన్న కొన్ని కారణాల కారణంగా నిర్మాణం ఆలస్యమైంది.







