కడప మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి హత్య కేసు( YS Vivekananda Reddy Murder Case ) విషయంలో ప్రస్తుత ఎంపీ అవినాష్ రెడ్డిని కాపాడటానికి అధికార వైసీపీ పార్టీ తాను చేయగలిగిందంతా చేసింది, అన్ని అస్త్రాలను వాడేసిన తర్వాత ఇక అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదనే అంచనాకు ఆ పార్టీ వచ్చిందని తెలుస్తుంది .ఆ పార్టీ నేతల వ్యాఖ్యలను చూస్తుంటే అవినాష్ రెడ్డి అరెస్టు విషయంలో వారు మానసికంగా సిద్ధమయ్యారని ఆ తదనంతర పరిణామాలను ఎలా ఎదుర్కోవాలా అని రెఢీ అవుతున్నట్లుగా తెలుస్తుంది .

సిబిఐ విచారణ తర్వాత పులివెందులలోని తన నివాసానికి వెళ్లిన అవినాష్ రెడ్డి అ క్కడ ప్రజా దర్బార్ నిర్వహించినట్టుగా తెలుస్తుంది.ఆ తర్వాత తన గెస్ట్ హౌస్ లో పార్టీ కీలక ఎమ్మెల్యేలతో తదుపరి పరిణామాల గురించి చర్చ జరిగిందని ,అరెస్టు తప్పదని తెలిపోయినందున తదుపరి పరిణామాల విషయం లో ఏ రకంగా ముందుకు వెళ్లాలనే విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అని తీవ్ర చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది .అరెస్ట్ అయితే బెయిల్ పై బయటకు వస్తారు అంటూ ఆ పార్టీ నేత రాచమల్లు మీడియాతో చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అరెస్టు తప్పదని వైసిపి కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తుంది ఆయనకు ఉన్న న్యాయ పరమైన రక్షణలు కూడా తొలగి పోయినందున ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చని ఆ పార్టీ అంచనా వేస్తుంది .

తన అరెస్ట్ పై ఒక అంచనకు వచ్చిన అవినాష్ రెడ్డి( Y.S.Avinash Reddy ) మాటల్లో కూడా వేదాంత దొరణి కనిపిస్తుందని తెలుస్తుంది.దేవుడు ఉన్నాడని, ఆయన చూసుకుంటాడని న్యాయమే గెలుస్తుంది అని ఆయన నేతలతో చెప్తున్నారట .అనవసరంగా ఈ కేసులో తనను ఇరికిస్తునారాని , సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా సునీత ( Sunitha Reddy )చాలా సార్లు మార్చుకున్నారని ఆయన పదేపదే చెప్తున్నారు .

అయితే అరెస్టు చేసినప్పటికీ ఈ హత్య విషయంలో తన పాత్రను ప్రూవ్ చేయటం సిపిఐ కి సాద్యం కాదని ఆయన బలంగా నమ్ముతున్నట్లుగా కనిపిస్తుంది … కేవలం దస్తగిరి వాంగ్మూలం తప్ప ఈ హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్ర నిరూపించే ఏ బలమైన ఆధారాలు లేవు కాబట్టి తాను కేసు విషయంలో కచ్చితంగా బయట పడగలనన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి
.






