దర్శకుడు గుణశేఖర్(Gunasekhar) దర్శకత్వంలో సమంత (Samantha)ప్రధాన పాత్రలో నటించిన చిత్రం శాకుంతలం(Shaakuntalam).ఓ అద్భుతమైన దృశ్య కావ్యం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేకపోయింది.ఈ సినిమాపై దర్శకనిర్మాతలు ప్రేక్షకులు ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు.అయితే ఆశించిన స్థాయిలో ఈ సినిమా సక్సెస్ కాలేదని చెప్పాలి.ఈ సినిమా ఘోర పరాజయం పాలవడంతో నిర్మాతలు భారీ నష్టాలను ఎదుర్కొన్నారు.ఇకపోతే తాజాగా ఈ సినిమాలో మేనక పాత్రలో నటించిన నటి మధుబాల (Madhu Bala)మొదటిసారి ఈ సినిమా పరాజయంపై నటించారు.

ఈ సందర్భంగా మధుబాల మాట్లాడుతూ.ఈ సినిమా కోసం దర్శక నిర్మాతలందరూ ఎంతో కష్టపడి పని చేసినప్పటికీ ఈ సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడం నాకు చాలా బాధ కలిగించిందని మధుబాల వెల్లడించారు.ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైనప్పటి నుంచి సినిమా విడుదల అయ్యే వరకు ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు.ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు ఓ అద్భుతమైన విజువల్ ట్రీట్ ఇవ్వాలని భావించారు.
ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎవరికి ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలా ప్రశాంతంగా షూటింగ్ జరిగిందని తెలిపారు.

పురాణ కథలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాని తెరకెక్కించారు.బాహుబలి, ‘ఆర్ఆర్ఆర్’.మంచి విజయాలు అందుకున్నాయి.
ఇలా ఈ సినిమాలు విజయం కావడానికి సరైన కారణాలు ఏవి లేవని చెప్పాలి.కానీ మా సినిమా మాత్రం ఇలా తీవ్రంగా అందరిని నిరాశ పరుస్తుందని అసలు ఊహించలేదు అంటూ ఈ సందర్భంగా మధుబాల శాకుంతలం సినిమా పరాశయం గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







