రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఆరే నరసయ్య భార్య, కూతురు ఇటీవల ప్రమాదవశాత్తు ప్రహరీ గోడ కూలి మరణించారు.బాధిత కుటుంబానికి మంగళవారం ఎల్లారెడ్డిపేట పవర్ యూత్ ఆధ్వర్యంలో నరసయ్యను పరామర్శించి భరోసా కల్పిస్తూ 50 కిలోల బియ్యాన్ని అందజేసి తమ ఔదర్యాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో పవర్ యూత్ సభ్యులు గుర్రం వెంకటేష్, రాఘవేంద్ర,కళ్యాణ్,వినోద్, సంతోష్, చిరంజీవి, అశోక్, రవి తదితరులు పాల్గొన్నారు.