మౌళిక వసతుల కల్పన కు కృషి చేస్తానని హామీ.రాజన్న సిరిసిల్ల జిల్లా :పవిత్ర రంజాన్ మాసం సందర్బంగా ఎల్లారెడ్డిపేట మైనార్టీ కమిటీ పట్టణ శాఖ అధ్యక్షులు రఫిక్ ఇంట్లో జరిగిన రంజాన్ విందుకు మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ హాజరయ్యారు.అల్లహ్ దయతో మన గ్రామప్రజలు చల్లగా ఉండాలని వారు కోరుకున్నారు.తాను గతంలో ఎంపీటీసీ గా ఉన్నప్పుడు ఈద్గా వద్ద బోర్ వేయించడం జరిగిందని అన్నారు.
భవిష్యత్ లో ఏమైనా మౌళిక వసతుల కల్పన కోసం కృషి చేస్తానని బాలరాజు యాదవ్ అన్నారు.







