కేంద్రంపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గన్ కల్చర్ ఉందన్న ఆయన తెలంగాణలో అగ్రికల్చర్ ఉందని తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అందించేవి పథకాలు, పనులైతే… బీజేపీవి కుట్రలు, పన్నాగాలు అని ఆరోపించారు.తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువ పెరిగిందని చెప్పారు.
రైతుల సంపద పెంచిన ఘనత సీఎం కేసీఆర్ దేనన్నారు.కాంగ్రెస్ వస్తే కాలిపోయే మోటార్లు వస్తాయని పేర్కొన్నారు.
బీజేపీ ఎన్ని ట్రిక్స్ చేసినా.హ్యాట్రిక్ కొడతామని వెల్లడించారు.







