వైసీపీ తీరుపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.అధికారాన్ని అడ్డు పెట్టుకొని వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందన్నారు అచ్చెన్నాయుడు.టీడీపీ అధికారంలోకి వచ్చాక చక్రవడ్డీతో కలిపి ఇచ్చేస్తామని తెలిపారు.
పీఠం ఎక్కాక మొదటి ఆరు నెలలు ఇదే పని అని చెప్పారు.ఈ నేపథ్యంలో గ్రామాల వారీగా లిస్ట్ తయారు చేసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
ఈ నాలుగేళ్లలో ఎవరూ తమను ఇబ్బంది పెట్టారో, ఎవరు తమ ఆస్తులను ధ్వంసం చేశారో లిస్ట్ పెట్టుకోవాలన్నారు.టీడీపీ అధికారంలోకి రాగానే అన్ని కలిపి ఇస్తామని స్పష్టం చేశారు.







