రానున్న ఎన్నికల్లో వైసీపీ సింగిల్ గానే పోటీ చేస్తుందని మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న వైసీపీ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ప్రజలకు మంచి చేశామనే ఇంటింటికి స్టిక్కర్స్ వేస్తున్నామని మంత్రి ఆదిమూలపు తెలిపారు.ఇదేవిధంగా టీడీపీ ఏం చేసిందో ప్రజలకు చెప్పి స్టిక్కర్లు వేయించుకోవాలని సూచించారు.
ఈనెల 20 న మెగా పబ్లిక్ సర్వే పూర్తి అవుతుందని వెల్లడించారు.