కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధర్నాకు దిగారు.ఈ మేరకు హుజురాబాద్ సీఐ రమేశ్ ను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు.
బీజేపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని ఈటల ఆరోపించారు.ఈ ఆందోళన కార్యక్రమంలో ఈటలతో పాటు పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.