వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ఉక్కు సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదని తెలిపారు.
ముందు ఆర్ఐఎన్ఎల్ ను బలోపేతం చేసే పనిలో ఉన్నామని కేంద్రమంత్రి ఫగ్గన్ సింగ్ వెల్లడించారు.ఈ మేరకు ప్లాంట్ పూర్తిస్థాయిలో పని చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
వీటిపై ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తామని పేర్కొన్నారు.బిడ్ లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనడం ఎత్తుగడేనని ఆరోపించారు.







