వైసీపీ పార్టీ వచ్చే ఎన్నికలలో చాలా సీరియస్ గా తీసుకోవడం తెలిసిందే.ఎట్టి పరిస్థితులలో 175కి 175 నియోజకవర్గాలు టార్గెట్ గా పెట్టుకుని అధ్యక్షుడు జగన్ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు.
పార్టీ నాయకులను నిత్యం ప్రజలలో ఉండాలని చెబుతున్నారు.ఈ క్రమంలో వైసీపీ నాయకులు ప్రతి ఇంటింటికి తిరుగుతూ “మా నమ్మకం నువ్వే జగనన్న( maa nammakam nuvve jagan )” అనే స్టిక్కర్లు అతికిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ స్టిక్కర్లు అతికించడంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు( Chandrababu Naidu ) మండిపడ్డారు.
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఇళ్లకు వైసీపీ స్టిక్కర్లను అతికించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏ పార్టీ వ్యక్తి అయినా సరే, వేరే ఇంటిపై రాయాలన్నా, పోస్టర్, స్టిక్కర్ వేయాలన్నా ఆ ఇంటి యజమాని అనుమతి తీసుకోవాలని మాజీ ఎన్నికల కమిషనర్ శేషన్ ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు.ఇంటి యజమాని లేకుండా స్టిక్కర్లు అతికించడం నేరమని పేర్కొన్నారు.
కడపలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది.
ఇక పులివెందులలో కూడా టీడీపీ జెండా ఎగరాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. టీడీపీ పార్టీ( TDP ) కార్యకర్తల పై.నాయకులపై దాడులు చేస్తే వడ్డీతో సహా చెల్లిస్తామని వైసీపీ నేతలను చంద్రబాబు హెచ్చరించారు.