మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు హాట్ కామెంట్స్ చేశారు.ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.
తమకు డబ్బులు, పదవులు ముఖ్యం కాదన్న తుమ్మల తన చరిత్ర అంతా ప్రజల దగ్గర ఉందని తెలిపారు.ప్రజలను మాయ చేసి, డబ్బులు ఇచ్చా తాము ప్రజాప్రతినిధులు కాలేదని చెప్పారు.
ప్రజల నమ్మకంతోనే గెలిచి ప్రజా ప్రతినిధులం అయ్యామని వెల్లడించారు.ప్రజలు అవకాశం ఇవ్వడం కారణంగానే నియోజకవర్గంలో అభివృద్ధి చేయగలుగుతున్నామని తుమ్మల వ్యాఖ్యనించారు.







