ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ సంచలన వ్యాఖ్యలు..!!

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్( Prasanth Kishor ) అందరికి సుపరిచితుడే.దేశంలో అనేక రాష్ట్ర ఎన్నికలను ఒంటిచేత్తో గెలిపించిన అద్భుతమైన స్ట్రాటజిస్ట్.2014 ఎన్నికల సమయంలో మోడీ ప్రధాని కావడంలో కీలకపాత్ర పోషించారు.2019 ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్( CM Jagan ) ముఖ్యమంత్రి కావటంలో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు బాగా వర్క్ అవుట్ అయ్యాయి.ఇదిలా ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెనకాల ప్రశాంత్ కిషోర్ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు( MLA Raghunandan ) సంచలన వ్యాఖ్యలు చేశారు.

 Bjp Mla Raghunandan Sensational Comments On Election Strategist Prashant Kishore-TeluguStop.com

పీకే సలహాలతోనే కేసీఆర్ ప్రధాని మోడీతో కయానికి కాలు దువ్వుతున్నారని ఆరోపించారు.దేశంలో అన్ని రాష్ట్రాలను ప్రధాని మోడీ సమన్యాయం దృష్టిలో చూస్తున్నారని రఘునందన్ రావు చెప్పుకొచ్చారు.ప్రతిపక్షాలను కూడా ఆహ్వానించి మా సంస్కృతిని తెలియజేసాము అని స్పష్టం చేశారు.

ఈ క్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రధాని మోడీకి సాదర స్వాగతం పలికితే.కేసీఆర్ ఎందుకు పలకటం లేదని రఘునందన్ రావు నిలదీశారు.

ఇదంతా ప్రశాంత్ కిషోర్ ఆలోచనల మేరకు కేసీఆర్… కేంద్రంతో నువ్వా నేనా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube