కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.నేచురల్ గ్యాస్ ధరలను నిర్ణయించే విధానాన్ని సర్కార్ సవరిచింది.
దీంతో వంట గదులకు సరఫరా చేసే పైప్డ్ నేచురల్ గ్యాస్, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ధరలు సుమారు 11 శాతం వరకు తగ్గబోతున్నాయి.
ప్రధాని మోదీ నేతృత్వంలో నిర్వహించిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
దీని వలన లక్షలాది మందికి ప్రయోజనం కలుగుతుందని వెల్లడించారు.ముఖ్యంగా పీఎన్జీ, సీఎన్జీలను ఉపయోగించే వారికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు.







