రాజధాని అమరావతి రైతులు భారత అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.ఆర్ -5 జోన్ వ్యవహారంలో స్టే ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది.
దీంతో అమరావతి రైతులు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో రైతుల పిటిషన్ పై ఈనెల 14న విచారణ చేస్తామని ధర్మాసనం తెలిపింది.
అయితే రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చెందిన పేదలకు అయినా రాజధానిలో 900 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేస్తూ ఆర్ -5 జోన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
కాగా జోన్ -5 ఏర్పాటుపై స్టే విధించాలని రైతులు హైకోర్టులో పిటిషన్ వేయగా.ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం తిరస్కరించింది.







