విశ్వశాంతిని కోరుతూ జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విజయవాడ లో అహింసా రన్ జరిగింది.రన్ లో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పీటీ ఉషా ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, , మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పోలీస్ కమీషనర్ క్రాంతి రాణా టాటా, డీసీపీ విశాల్ గున్నీ, గన్నవరం ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంతరెడ్డి తదితరులు కూడా హాజరైయారు.3కె, 5కె,10కె విభాగాల్లో నిర్వహించిన మారథాన్ లో క్రీడాభిమానులు , యువతఅధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా పీటీ ఉష మాట్లాడుతూ అహింసా, ఫిట్ నెస్ , ఉమెన్ ఎంపవర్ మెంట్ కోసమే ఈ రన్ అని వ్యాఖ్యానించారు.
ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అహింసా రన్ నిర్వహించారు అని, దీనిలో భాగంగానే విజయవాడలో నిర్వహించిన అహింసా రన్ లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.తాను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టి మూడు , నాలుగు నెలలే అవుతుంది అని, అసోసియేషన్ లో అనేక సమస్యలున్నాయి అని ప్రస్థావించారు.
అఫ్లియేషన్ సమస్యలను పరిష్కరించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు….