ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై సీపీఐ నేత రామకృష్ణ స్పందించారు.కమ్యూనిస్టులను కించపరిచేలా సజ్జల మాట్లాడటం సరికాదని తెలిపారు.
తమను ఏమైనా విమర్శించవచ్చన్న రామకృష్ణ టీడీపీతో పోల్చడం ఏంటని ప్రశ్నించారు.2004లో కాంగ్రెస్ తో సీపీఐ, సీపీఎం పొత్తు పెట్టుకున్నాయన్నారు.ఆ రోజు వైఎస్ కు పీఆర్వోగా ఉన్న సజ్జల ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.