నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.ఏపీ రాజధాని అమరావతేనని తెలిపారు.
అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రశంసలు జల్లు కురిపించారని తెలుస్తోంది.రాజధాని విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ప్రపంచానికే ఆదర్శమని వ్యాఖ్యనించారు.
సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా అమరావతిని స్వాగతిస్తామన్నారని చెప్పారు.అయితే అమరావతి మట్టి పెళ్ల కూడా ఎవరూ తీసుకెళ్లలేరన్న ఆయన మూడు ముక్కలు అన్న వాళ్లు కొట్టుకుపోతారని పేర్కొన్నారు.
అమరావతికి అనుకూలమైన ప్రభుత్వం రాబోతుందని జోస్యం చెప్పారు.