తన పోలికలతో ఉండే యువతిని చంపి..ప్రియుడితో పారిపోయిన యువతి..ఆలస్యంగా వెలుగులోకి..!

ఇటీవలే తమ అవసరాల కోసం కొత్త కొత్త దారులు వెతుకుతూ.దారుణాలకు పాల్పడుతున్నారు.

మనుషులు డబ్బు కోసం, శారీరక సుఖం కోసం విచక్షణారహితంగా ప్రవర్తిస్తూ చివరికి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.సమాజంలో రోజురోజుకు మానవత్వానికి చోటు లేకుండా పోతోంది.

హర్యానా రాష్ట్రంలో( Haryana ) ఓ ప్రేమ వ్యవహారం ఓ అమాయకురాలిని బలి తీసుకుంది.కాస్త దగ్గర పోలికలు ఉండడమే ఆ యువతికి శాపంగా మారింది.

ఎటువంటి కారణం లేకుండా, తాను ఎందుకు చనిపోతుందో కూడా తెలియకుండానే ప్రాణాలు విడిచింది.వివరాల్లోకెళితే జ్యోతి, కృష్ణ లు ఇద్దరూ కాలేజీలో చదువుకుంటూ ప్రేమించుకున్నారు.

Advertisement

వీరి ప్రేమ వివాహానికి( Love Marriage ) జ్యోతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు.ఇక పారిపోయి పెళ్లి చేసుకోవడమే దీనికి పరిష్కారం అని ఓ మాస్టర్ ప్లాన్ వేశారు.

జ్యోతి ( Jyothi ) లాగనే ఉండే యువతిని హత్య చేసి తాము పారిపోయి పెళ్లి చేసుకుందామని పథకం రచించారు.అయితే ఈ హత్య 2017 సెప్టెంబర్ ఐదున జరిగింది.

జ్యోతి, సిమ్రాన్ లు చూడడానికి అచ్చం ఒకేలా ఉంటారు.

పైగా ఇద్దరు స్నేహితులు కావడంతో జ్యోతి, సిమ్రాన్ ను జీటీ రోడ్డుకు పిలిచి కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి తాగించింది.ఇక సిమ్రాన్ కాస్త మత్తు లోకి వెళ్ళగా వెంటనే గొంతు కోసి హత్య చేశారు.జ్యోతి బట్టలు సిమ్రాన్ కు వేసి, జ్యోతి కు సంబంధించిన కొన్ని గుర్తింపు కార్డులను ఆ ప్రదేశంలో పడేసి ఇద్దరు ప్రేమికులు పరారయ్యారు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
నేడు జగన్ ఎన్నికల ప్రచారం .. ఎక్కడెక్కడంటే..?

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇది జ్యోతి మృతదేహం గా భావించి కుటుంబ సభ్యులకు అప్పగించడంతో అంత్యక్రియలు జరిపించారు.

Advertisement

సిమ్రాన్ కనిపించడం లేదని సిమ్రాన్ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.పోలీసులు హత్యకు గురైన యువతి ఫోటోలను సిమ్రాన్ తల్లిదండ్రులకు చూపించగా.మెడలో ఉన్న దారం, ముక్కు పుడక ఆధారంగా అది సిమ్రాన్ మృతుదేహం అని తేలింది.

ఇక జ్యోతి, కృష్ణ ల కోసం పోలీసులు గాలించగా 2020లో దొరికారు.కోర్టులో కేసు నడుస్తూ ఉండగా క్షయ వ్యాధితో కృష్ణ జైలులో చనిపోయాడు.తాజాగా మంగళవారం పానిపత్ కోర్టు జ్యోతికి జీవిత ఖైదు విధించింది.

తాజా వార్తలు