ప్రస్తుతం సమాజంలో దారుణాలు విపరీతంగా పెరుగుతూ ఎవరిని నమ్మాలో.ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి.
వివాహ బంధాలకు, కుటుంబ బంధాలకు, స్నేహాలకు విలువ క్రమేనా తగ్గుతూ పోతోంది.రకరకాల అక్రమ సంబంధాల( Illegal relationship ) వల్ల మరణాల సంఖ్య ఎక్కువగా పెరుగుతోంది.
ఎదుటివారి ఆకర్షణలకు లోనై భార్య- భర్తను చంపడం, భర్త- భార్యను చంపడం లాంటి దారుణాలు కుటుంబాలనే నాశనం చేస్తున్నాయి.ఒక వ్యక్తి స్నేహితుడి భార్యపై( Friends wife ) కన్నేసి.
చివరికి రక్తపు మడుగులో శవమై కనిపించిన ఘటన తమిళనాడులోని ( Tamil nadu ) తెన్ కాసి లో స్థానికంగా కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తెన్ కాసి జిల్లా సెంకొట్టలో అయ్యప్పన్ అనే వ్యక్తి వివాహం అయినా కూడా ఒంటరిగా నివసించేవాడు.
అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తితో కలిసి పని చేస్తూ, అప్పుడప్పుడు ఆ వ్యక్తితో కలిసి అయ్యప్పన్ మద్యం సేవించేవాడు.ఖాళీ సమయం దొరికితే చాలు అయ్యప్పన్ ఆ వ్యక్తి ఇంటికి వెళ్లి మద్యం సేవిస్తూ ఆ వ్యక్తి భార్యపై కన్నేశాడు.
ఆ వ్యక్తి భార్య స్నానం చేసేటప్పుడు తొంగి చూడడం లాంటి పనులు చేయడంతో ఆ వ్యక్తి భార్య, భర్తతో అయ్యప్పన్ వక్రబుద్ధి గురించి చెప్పింది.దీంతో అయ్యప్పన్ కు గట్టిగా బుద్ధి చెప్పాలని స్నేహితులతో కలిసి అయ్యప్పన్ పై ప్రతీకారం తీర్చుకోవాలని ఆ వ్యక్తి నిర్ణయించుకున్నాడు.
పథకం ప్రకారం అయ్యప్పన్ ను మద్యం సేవించేందుకు ఆహ్వానించి, మద్యం మత్తులో ఉండగా ఇద్దరు స్నేహితుల సహాయంతో అయ్యప్పన్ పై దాడి చేశాడు.తలకు బలంగా కర్ర తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు అయ్యప్పన్.మృత దేహాన్ని చుట్టుపక్కల వారు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కు తరలించారు.ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు ఆ వ్యక్తిని గట్టిగా విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.